GNTR: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (HDS) సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. ఆసుపత్రిలోని ఎస్బీఐ శాఖను గల్లా జయదేవ్ బ్లాక్కు మార్చాలని నిర్ణయించారు.