KKD: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ఈశ్వరరాజు వర్మ ఆదివారం తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఇందులో రచన, సైన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు.