KDP: లింగాల మండలం బోనాల గ్రామంలో మంగళవారం సాయంత్రం టిప్పర్ కిందపడి దస్తగిరి అనే డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బోనాల నుంచి పొలాలకు మట్టి లోడ్ చేస్తుండగా, మరో టిప్పర్ వెనుకవైపు నుంచి దస్తగిరిపైకి దూసుకురావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దస్తగిరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.