ELR: ఉంగుటూరు మండలంలో మొదటి రోజు సోమవారం జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షలకు 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఉంగుటూరు ఎంఈవో- 1 సాయిబాబా తెలిపారు. మండలంలో ఐదు పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు 692 మందికి 666 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.