అనంతపురంలోని 8 వాహన షోరూంలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వాహన కొనుగోలుదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఉప రవాణా కమిషనర్ వీర్రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు తనిఖీలు చేపట్టాయి. నిబంధనల ప్రకారం ధరల పట్టిక ప్రదర్శించని కున్ హ్యుందాయ్, రిత్విక మోటార్స్, జయలక్ష్మి మారుతి షోరూంలపై చర్యలకు ఆదేశించారు.