NDL: బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో 78 రోజులకు రూ.52,19,831 నగదు వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల్లో 7.210 మిల్లీ గ్రాముల బంగారం, 621.320 గ్రాముల వెండి ఉన్నాయని ఆయన వివరించారు.