NLR: ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం(M) సాయిపేట పంచాయతీలో మొసలి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు గేదెలను మేతకు తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా మక్కెనవారిపాలెం వాగులో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై కావలి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మొసలి ఆనవాళ్లను పరిశీలించారు.