GNTR: తెనాలి పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.