W.G: ఆకివీడులో అర్థరాత్రి గొంతేనమ్మ గుడిని కూల్చివేయడం అప్రజాస్వామికమని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించి, పోలీసు, పంచాయతీ సిబ్బందితో ఈ చర్య చేపట్టడం దారుణమన్నారు. ఘటనలో అధికార యంత్రాంగం, పోలీసుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.