PPM: జిల్లాలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ గిరిజన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. మార్చి 26న జరిగిన ఈ ఘటనలో పరుష పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.