E.G: కడియం మండలం వీరవరం గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసైనికులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని పార్థించారు.