PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.