KRNL: కర్నూలు తాలూకా యుపీఎస్ పరిధిలోని గొందిపల్ల సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. జేసీబీ వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఖాసీం సాహెబ్(43) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆటో డ్రైవర్ బోయ మహేశ్ (39) చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.