KRNL: కృష్ణగిరి మోడల్ స్కూల్లో నేడు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నిర్మలాకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు సంబంధించి 113 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకోవాలని, పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, హాల్టికెట్, ఆధార్తో రావాలన్నారు.