PPM: వల్లరిగుడబ పంచాయతీ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది. పాతబడిన ఈ భవనంలో గోడలు, పునాదుల్లో పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారు భయంతోనే అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.