ASR: డుంబ్రిగూడలో ఐవీఆర్ఎస్ విధానంపై అవగాహన సదస్సును మండల సర్వేయర్ రమేష్ నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరగా, సులభంగా అందించేందుకు ఐవీఆర్ఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ఫోన్ కాల్ ద్వారా అవసరమైన సమాచారం పొందడంతో పాటు వివిధ సేవలపై ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.