ASR: ముంచంగిపుట్టు మండలంలోని లబురు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వంటగది, ప్రహరి గోడ, డైనింగ్ హాల్, త్రాగునీటి సదుపాయం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.