WG: పేరుపాలెం తీరం ఆదివారం సెలవు దినం కావడంతో జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సందర్శకులు సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక తిన్నెలపై సరదాగా గడుపుతూ సేదతీరారు. తీరంలో యువత కేరింతలు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పర్యాటకులు సమీపంలోని కొబ్బరి తోటల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు.