ELR: నూజివీడు పీఎసీఎస్ సభ్యులు మురళీకృష్ణ, భాస్కరరావు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు శనివారం పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పీఎసీఎస్ అధ్యక్షులు పసుపులేటి జగన్ మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ సభ్యులు, రైతుల పురోభివృద్ధి ద్యేయంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఎల్లవేళలా సభ్యులకు అండగా ఉంటామన్నారు. సీఈవో నీలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.