KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట రహదారిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ కుమారుడు సంసోను బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దకడబూరు నుంచి కల్లుకుంట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే అతడిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.