కోనసీమ: నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఇవాళ మల్కిపురంలోని డిగ్రీ కళాశాల వద్ద అధికారులు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే సందర్శించి నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు.