TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపళ్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం ఉదయం 9 గంటలకు హుండీ లెక్కించారు. మధ్యాహ్నం వరకు కౌంటింగ్ జరిగింది. తిరుపతి దేవాదాయ శాఖ తనిఖీదారు ఫణిరాజశయన, ఆలయ ఈవో లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. హుండీల ద్వారా ఆలయానికి రూ. 6. 17 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో వెల్లడించారు.