కోనసీమ: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అమలాపురంలో వైసీపీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చిన దగ్గరనుంచి కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. అందుకే రాధాకృష్ణ విష ప్రచారం చేస్తున్నారన్నారు.