SKLM: ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్.రామ్మోహన్రావు అధ్యక్షతన బుధవారం మంచి నీటి సంరక్షణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలంలో ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించాలని అన్నారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి నాణ్యతను తప్పనిసరిగా పరీక్షించాలని ఆదేశించారు.