ATP: డి.హీరేహల్ మండలం దొడగట్ట గ్రామంలో MLA కాలవ శ్రీనివాసులు ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడారు. పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, రైతుల పరిస్థితులపై స్వయంగా ఆరా తీశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కల్పించడమే లక్ష్యమన్నారు.