TPT: చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆవులు మేపుకొంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఇంట్లో రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాట్లు సమాచారం. ఈ దాడిలో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ బంగ్లాకు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.