KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. బాలిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 35 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు. శనివారం బంధువుల కార్యక్రమానికి కుటుంబంతో కలిసి పెనికలపాడు గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పక్కింటి వారు వాకిలి తెరిచి ఉందని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులో వచ్చింది.