సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సోమవారం మంత్రి సవితను కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.