ASR: అనంతగిరి(M) గరుగుపల్లి పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ ఇఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు ఆశయాలు, అభివృద్ధి దృష్టి నచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు.