W.G: భీమవరం మండలం అనాకోడేరు గ్రామ సచివాలయాన్ని జేసి టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. భూ సంబంధిత పనులను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.