KRNL: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల మ్యాపింగ్ లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీపీవో భాస్కర్ను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను వార్డుల వారీగా సరిగ్గా మ్యాప్ చేశారా లేదా అని పరిశీలించారు.