VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం గంట్యాడ మండలం రామవరం గ్రామంలో గజపతినగరం నియోజకవర్గంలోని VAO లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు ప్రభుత్వం అందించడం వలన పొదుపు సంఘాలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రజలకు, పొదుపు సంఘాలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.