VZM: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.