NDL: డోన్ మార్కెట్ యార్డ్లో గురువారం జరిగే పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారని పట్టణ అధ్యక్షులు బద్రి ఫిర్యాదు చేశారు. పశువులకు ఇరుకుగా కాకుండా తగిన దాణా, నీటి సదుపాయాలతో రవాణా చేయాలని కోరారు. అలాగే ప్రతి గురు, శని వారాల్లో పశువుల అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి అందజేశారు.