సత్యసాయి: ముదిగుబ్బ మండలం బూడనంపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నిరాడంబరతను చాటుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం, అక్కడ శ్రమిస్తున్న రైతు కూలీలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. హోదాను పక్కన పెట్టి సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.