సత్యసాయి: దేశాభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జనగణన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్వీయ గణనను పూర్తి చేశారు. ప్రజలందరూ బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొని, ఖచ్చితమైన వివరాలను అందించాలని కలెక్టర్ కోరారు. స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.