KKD: రాష్ట్ర ప్రజలపై మాజీ CM జగన్ విషం కక్కుతున్నారని కాకినాడ సిటీ MLA కొండబాబు విమర్శించారు. బుధవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శాశ్వత రాజధానిగా అమరావతి కోసం అసెంబ్లీ తీర్మానం చేసిందని, పార్లమెంట్ కూడా ఆమోదం తెలుపుతుందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదని, ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.