చిత్తూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిట్టూరుకు చెందిన దామోదర నాయుడు (50) అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి చెందాడు. దీంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.