W.G.భీమవరం పట్టణంలోని రాయలం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు అత్యవసర సమయాల్లో రోగులకు ప్రాణ రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం రక్తదాతలను అభినందించారు.