KKD: ప్రత్తిపాడు మండలంలోని చింతలూరు గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడినట్లు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దృష్టికి రాగానే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు చెక్ పెట్టారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు, సంబంధిత అధికారులకు చింతలూరు గ్రామ ఎస్సీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు.