KNR: గంగాధర మండలం కురిక్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలు అందజేశారు.