GNTR: తెనాలి వన్ టౌన్ పరిధిలోని వైకుంఠపురం వద్ద డీఎస్పీ జనార్ధన్ రావు నేతృత్వంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటి తనిఖీలు చేసి ఆధార్, ఇతర పత్రాలు పరిశీలించారు. సరైన రికార్డులు లేని 40 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.