NTR: నందిగామ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఈద్గా చేరుకుని ముస్లిం సోదరులు, సోదరీమణులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.