KDP: ఒంటిమిట్ట మండలం గొల్లపల్లె, దర్జీపల్లెల్లో నిర్వహించిన ‘రైతన్న మీకోసం-ఇంటింటికి’ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులపై వివరాలు తెలుసుకుని, వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు.