కడప జిల్లాలో జర్నలిస్టులకు 2వ విడత అక్రిడిటేషన్లు మంజూరయ్యాయి. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదంతో 189 మంది అర్హులైన పాత్రికేయులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. తొలి విడతలో ఇప్పటికే 538 మందికి అక్రిడిటేషన్లు మంజూరయ్యాయని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.