PPM: వినియోగదారుల్లో చైతన్యం పెంపొందితేనే నాణ్యమైన జీవితం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం గిరిమిత్ర భవనంలో మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ‘షైన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో కేవలం ధర, అందుబాటును మాత్రమే ఆధారంగా తీసుకోకుండా, వాటి నాణ్యత, బ్రాండ్, ప్రమాణాలను పరిశీలించాలన్నారు.