CTR: పలమనేరు గంటావూరు చెరువులో మట్టి అక్రమాలపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే పోలీస్, ఇరిగేషన్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుతో పాటు స్మశానంలో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు కూడా మాఫియాను అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.