ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కర్నూలు ఫ్లై ఓవర్ వద్ద మంగమ్మ కాలేజీ వైపు నుంచి మంగమూరు సిగ్నల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెనక కూర్చున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయపడిన బాలికను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికు చికిత్స కోసం తరలించారు.