SKLM: దర్జీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక చేయూత అందించాలని దర్జీలు డిమాండ్ చేశారు. టైలర్స్ డే సందర్భంగా మందసలో శనివారం ర్యాలీ నిర్వహించారు. కుట్టు మిషన్ షాపులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని కోరారు. దర్జీలకు ఉపాధి కరువైందని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.