అల్లూరి: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4వ జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గాను కళాశాలల్లో జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం అంశాలపై సెమినార్ ఉంటుందన్నారు.